కవిత పార్టీ ప్రకటన... స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

  • ఎన్ని పార్టీలు పుట్టుకువచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదన్న రామచందర్ రావు
  • తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని వ్యాఖ్య
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత తన కొత్త పార్టీని ప్రకటించడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా, కొత్త పార్టీలు పుట్టుకువచ్చినా బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పన్నెండేళ్లుగా అవినీతిరహిత పాలనను అందిస్తున్నారని తెలిపారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలామంది పార్టీలు పెడుతున్నారని, ఇప్పుడే ఒకరు పార్టీని ప్రకటించారని తెలిపారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అయిందని, ఇప్పుడు వారి బిడ్డ పెట్టే పార్టీ కూడా టీఆర్ఎస్ అని చురక అంటించారు. దేశంలో అవినీతిరహిత పాలన ఇస్తోంది బీజేపీ మాత్రమే అన్నారు.

Kavitha
BRS
Telangana BJP
Ramachander Rao
Telangana Politics
BJP
KCR
KA Paul
New Political Party

More Telugu News